Nestham Movie Creations

Thursday, 17 November 2016

దీపికా పదుకునే నల్ల ధనం ఉచ్చులో చిక్కుకుందా...? రూ.40 కోట్ల ప్లాట్ గిఫ్టుగా ఇచ్చేస్తుందట...


deepika padukoneబాలీవుడ్‌ బామ దీపికా పదుకొనే.. కోట్లను గిఫ్ట్‌గా ఇస్తుందట. ఇదేదో చెల్లని డబ్బును సేల్‌ చేసుకోవడమేనని అంటున్నారు. అదేమిటంటే.. దీపికా ముంబైలోని ప్రభాదేవి ప్రాంతానికి సమీపంలోని ఒక టవర్‌లో 40 కోట్లతో ఒక ప్లాట్‌ కొనుగోలు చేసిందట. 30వ అంతస్తులోని ఈ ప్లాట్‌ను తనకి ఎంతో ఇష్టమైన వారికి గిఫ్టుగా ఇవ్వనున్నానని చెబుతోంది. కాగా, ఇందులోనే 16 కోట్లతో తన కోసం మరో ప్లాట్‌ను బుక్‌ చేసింది. దాంతో దీపికా 40 కోట్లతో కొనుగోలు చేసిన ప్లాట్‌ ఆమె తల్లిదండ్రుల కోసమేనని చెప్పుకుంటున్నారు. అంతా ఒకే దగ్గర ఉండటం కోసమే ఆమె ఒకే టవర్లో రెండు ప్లాట్లు తీసుకుందని అంటున్నారు. ఒకేసారి ఆమె ఇంత ఖరీదైన ప్లాట్లు కొనడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌‌గా మారింది.

No comments:

Post a Comment

About

Flickr