
కమెడియన్గా రాణించడం సంతోషంగా ఉందని, కమెడియన్గా ఇప్పటివరకు సుమారు 150 చిత్రాల్లో నటించానని జబర్దస్త్ ఫేం అప్పారావు పేర్కొన్నారు. రాయవరం మండలం పసలపూడిలో మంగళవారం ఈస్టువెస్టు బ్యానర్పై బొడ్డు శ్రీలక్ష్మి సమర్పణలో వెంకట్ దర్శకత్వంలో జరుగుతున్న ‘మామ.. ఓ చందమామ’ షూటింగ్లో పాల్గొనడానికి వచ్చిన ఆయన విలేకర్లతో మాట్లాడారు. తనది విశాఖపట్నం జిల్లా అక్కయ్యపాలెం గ్రామమని, పీయూసీ పూర్తిచేసి అనంతరం సినిమా రంగంలోకి ప్రవేశించినట్లు చెప్పారు. తన తొలిగురువు ఎల్.సత్యానందం మాస్టారు అని చెప్పారు. తనకు బీవీ రమణ దర్శకత్వంలో శుభవేళ చిత్రంలో నటించే అవకాశం లభించిందన్నారు. గోపి.. గోపికా గోదావరి, వేదం, నేనింతే, శ్రీఆంజనేయం, చందమామ, మనం, మినుగురులు వంటి చిత్రాల్లో నటించే అవకాశం దక్కిందన్నారు. తనకు షకలక శంకర్ జబర్దస్త్ ప్రోగ్రాంలో చేసే అవకాశం కల్పించారని, జబర్దస్త్ ద్వారా నటుడిగా అవకాశాలు పెరిగాయన్నారు. సుమారు 100చిత్రాల్లో నటించే అవకాశం వచ్చిందన్నారు. తాను నటించిన చందమామ, వీడింతే చిత్రాలు తనకు సంతృప్తినిచ్చాయన్నారు.
No comments:
Post a Comment